Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ రిలీజ్ వేడుకలో బెల్లంకొండ సురేష్
'ప్రేక్షకులు ప్రతి సారి నా నుంచి కొత్త కథలను ఆశిస్తారు. కానీ ఈ సారి మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో వస్తున్నా. కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను' అని నారా రోహిత్ అన్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో సరస్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై బి.మహేంద్రబాబు, ముసునూను వంశీ, వినోద్ నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాలకృష్ణుడు'. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, 'నాలుగేండ్లుగా పవన్ కథపై వర్కౌట్ చేస్తున్నారు. రాజా మంచి కథ అందించారు. కంప్లీట్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రమిది. ఇప్పటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటూ వస్తున్న నారా రోహిత్ ఫస్ట్ టైమ్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఇది కచ్చితంగా కమర్షియల్ హిట్ అవుతుంది' అని అన్నారు.
'ప్రాపర్ కమర్షియల్ సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ పాతదే అయినా కథనం కొత్తగా, వినోదాత్మకంగా ఉంటుంది. నాకు, పృథ్వీకి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. మణిశర్మతో నాకిది నాల్గవ సినిమా. మంచి మ్యూజిక్ అందించారు. రెజీనాతో కలిసి నటించడం మూడోసారి. మూడు సార్లు మూడు విభిన్నమైన జోనర్ సినిమాలు చేశాం. సినిమా విజయం సాధించి డబ్బులు పెట్టిన నిర్మాతలకు డబుల్ కలెక్షన్లు రావాలి' అని హీరో నారా రోహిత్ తెలిపారు.
పవన్ మల్లెల చెబుతూ, 'రెండేండ్లుగా సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. ఓ కథ అనుకున్నాం నచ్చలేదు. రైటర్ రాజా కలిసి 'నువ్వు వెంటనే సినిమా చేయాలి. నా దగ్గర మంచి కథ ఉంది..' అని ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. కథ విన్న వెంటనే రోహిత్ ఓకే చేశారు. కథ కొత్తది కాదు, పూర్తి కమర్షియల్ సినిమా ఇది. కానీ తీసిన విధానం కొత్తగా ఉంటూ వినోదాన్ని పంచుతుంది. పృథ్వీ, శ్రావ్యారెడ్డి, రోహిత్, రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇండిస్టీలోకి వచ్చేటప్పుడు అన్నింటికీ సిద్ధపడి రావాలి. అన్ని అడ్డంకులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. మేం సినిమా కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ శుక్రవారం విడుదల కానున్న మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'టీమ్ అంతా చాలా కష్టపడి ఇష్టంగా చేసిన చిత్రమిది' అని రైటర్ రాజా అన్నారు. అనిల్ రావిపూడి చెబుతూ, 'ఇటీవలే ప్రివ్యూ చూశా. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు నారా రోహిత్, పృథ్వీ, శ్రీనివాస్రెడ్డి పాత్రలు గుర్తుకొస్తాయి. పవన్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా డీల్ చేశారు. ఇందులో రోహిత్ ముగ్గురు వ్యక్తులను ఇమిటేట్ చేశారు.
అందులో ఇద్దరు ఆయన ఫ్యామిలీకి చెందిన లెజెండ్స్ ఉన్నారు.
అలాగే ఫ్యామిలీ కాని మరో వ్యక్తిని ఇమిటేట్ చేయడం
నాకు బాగా నచ్చింది' అని అన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం బెల్లంకొండ సురేష్, అనిల్రావిపూడి సంయుక్తంగా చిత్ర బృందానికి ప్లాటినమ్ డిస్క్లను అందజేశారు. ఇందులో నిఖిల్, శ్రావ్యారెడ్డి, వెన్నెలకిషోర్, మహేంద్ర, వంశీ తదితరులు పాల్గొని సినిమాను ఆదరించాలని కోరారు.