Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలీవుడ్లో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'. కరణ్జోహర్ తెరకెక్కించిన ఈచిత్రంతోనే నా బాలీవుడ్ ఎంట్రీ సూపర్గా జరిగింది. ఈచిత్రానికి సీక్వెల్గా రూపొందబోయే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'లోనూ నేను మెరుస్తాను' అని అంటోంది అలియాభట్. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ధావన్, అలియాభట్ ప్రధాన తారాగణంగా 2012లో కరణ్జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రాన్ని రూపొందించారు.
ప్రేక్షకుల విశేష ఆదరణతో ఈచిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా పునీత్ మల్హోత్ర దర్శకత్వంలో కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా టైగర్ షరాఫ్ నటిస్తున్నారు. ఈయన సరసన దిశాపటానీ, చుంకీపాండే తనయ అనన్య పాండే నటించే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఓ అతిథి పాత్రలో అలియా నటించనుంది. దీని గురించి అలియా మాట్లాడుతూ,'నా కెరీర్కు 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' మంచి పునాది వేసింది. అతిథి పాత్ర అయినప్పటికీ ఈ చిత్ర సీక్వెల్లోనూ నేను కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పింది. అలియా ఈ చిత్రంతోపాటు ప్రస్తుతం 'రాజీ', ఆనంద్.ఎల్.రారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది.