Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి హీరోలో ప్లస్లు, మైనస్లుంటాయి. ప్లస్లు ఎక్కువ ఉన్న హీరో టాప్ పొజిషన్కు వెళ్తాడు' అని అంటున్నారు దర్శకులు కె.ఎస్.రవికుమార్. బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రం
'జై సింహా'. సి.కళ్యాణ్ నిర్మాత.
ఇటీవల విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో శనివారం దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ, 'సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఊహించిన దానికంటే బాగా ఆదరిస్తున్నారు. అయితే మొదటి రెండు మూడు రోజులు అభిమానులే ఉంటారు. తర్వాత వచ్చే వారు నిజమైన ప్రేక్షకులు. వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. బాలకృష్ణతో సినిమా చేయాలని 8 ఏండ్ల క్రితమే అనుకున్నాం. అప్పుడు ఓ కథ అనుకున్నాం, చివరి నిమిషంలో కథ బాగా లేక చేయలేదు. మళ్ళీ ఆయనతో సినిమా చేయాలని ఐదారు కథలు అనుకున్నా. కానీ రత్నం చెప్పిన లైన్లో ఓపెనింగ్ సన్నివేశం, క్లైమాక్స్ సన్నివేశం నచ్చి ఈ కథ చేశాం. 14 ఏండ్ల తర్వాత తెలుగులో చేసిన చిత్రమిది. బేసిక్గా ఇది లవ్ స్టోరీ. పూర్తిగా లవ్ ట్రాక్ పెడితే బాలకృష్ణకు సూట్ కాదు. అందుకే కుటుంబ అనుబంధాలు, ఎమోషనల్ సన్నివేశాలు, సెంటిమెంట్ పెట్టాం. లవ్ కూడా మెచ్చ్యూర్డ్గా ఉంటుంది. డ్యూయెట్స్ పెడితే సెట్ కాదు. అయా సన్నివేశాలు సినిమాలో బాగా పండాయి. కథ పాతది అంటున్నారు. కానీ సెంటిమెంట్, లవ్ ఎవర్గ్రీన్. వాటిని కొత్తగా చెప్పడమే చేయాల్సింది. బేసిక్గా నేను కథ రాసుకునేటప్పుడు ఓ ఆడియెన్లా ఫీలై రాస్తాను. బాలకృష్ణ వంటి మాస్ హీరోకు రజనీకాంత్ తరహా మాస్ అంశాలే పెట్టాలి. కమల్ హాసన్లా క్లాస్గా చెబితే జనం చూడరు. అందుకే బాలకృష్ణను ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఇందులో పాటలు, ఫైట్స్, డైలాగులు ఇలా అన్ని అంశాలను మేళవించాం. బాలకృష్ణ కూడా చాలా బాగా నటించారు. సంక్రాంతి సినిమాగా బాగా ఎంజారు చేస్తున్నారు. క్లాస్ సినిమా కొంత మందికే కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ సినిమానే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
నేను తెరకెక్కించే సినిమాలో కామెడీ, అనుబంధాలు, ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటాను.
అవే సినిమాకు బలం. తదుపరి చిత్రాలు ఇంకా ఏం అనుకోలేదు. నేనేది ప్లాన్ చేయను.
వచ్చిన ఛాన్స్లను సద్వినియోగం చేసుకుంటూ వెళ్తాను. అన్ని కుదిరితే తెలుగులోనూ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమే' అని అన్నారు.