Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పురాణాల్లో చేసింది తప్పయితే అయితే ఇప్పుడు నేను చేసిందీ తప్పే' అని అంటున్నారు మోహన్బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్ రామిగాని దర్శకుడు. మంచు విష్ణు, శ్రియా, నిఖిలా విమల్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్బాబు నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ చిత్రం గురించి యూనిట్ చెబుతూ, ''రామాయణంలో రాముడికి, రావణాసురుడికి గొడవ, మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళూ వాళ్ళూ కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది, కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు, ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్ళు దేవుళ్ళయితే, ఇక్కడ నేనూ దేవుడినే. అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో ఛాయిస్ ఈజ్ యువర్స్' అని టీజర్లో మోహన్బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మంచు విష్ణు ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా శ్రియా నటించారు. వీరు ఆదర్శదంపతులుగా కనువిందు చేస్తారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపింది. బ్రహ్మానందం, అనసూయ, తనికెళ్ళభరణి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ.