Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై తల్లాడా సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'ఎందరో మహానుభావులు - ఇందులో కొందరు కేటుగాళ్లు'. తల్లాడా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు మారుతి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ఇదొక ప్రయోగాత్మక చిత్రం. సమకాలీన పరిస్థితులు, ప్రేమ, రాజకీయం, హాస్యం వంటి తదితర అంశాల సమాహారంగా రూపొందే ఈచిత్రం ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతినిస్తుంది. గోవా, అమలాపురం, విశాఖపట్నం, అరకు, ఖమ్మం, వరంగల్ వంటి తదితర ప్రదేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఫైట్స్ హైలైట్గా ఉంటాయి. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు మారుతి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని చెప్పారు. సాయికృష్ణ, అనిషా, షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న ఈచిత్రంలో తనికెళ్ళభరణి, కిషోర్దాస్, సుధాకర్, మాయ కృష్ణ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రానికి ఫైట్స్ : శ్యామ్, ఎడిటింగ్ : క్రాంతి, సంగీతం : సిద్ధార్థ్, కెమెరా : శివ, డాన్స్ : భరత్, మాటలు: కిరణ్ కోడూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కుంచపర్తి సాయికుమార్.