Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో మహేష్ సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తున్న కైరా అద్వానీ తాజాగా బాలీవుడ్లోనూ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ 'హౌస్ఫుల్ 4'లో స్టార్స్తో మెరవనుంది. ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో అక్షరు కుమార్, జాన్ అబ్రహం, రితేష్ దేశ్ముఖ్, సంజరు దత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కథానాయికలుగా ఇప్పటికే దిశా పటానీ, పరిణీతి చోప్రా ఎంపిక కాగా మరో కథానాయికగా కైరా అద్వానీని ఫైనల్ చేశారట. దీంతోపాటు కరణ్ జోహర్ రూపొందించే 'బాంబే టాకీస్ 2'లోనూ కథానాయికగా కైరా నటించనున్నట్టు తెలుస్తోంది. గతంలో 'ఫగ్లీ', 'ఎం.ఎస్.దోనీ: ది అన్టోల్డ్ స్టోరీ', 'మెషిన్' వంటి తదితర చిత్రాల్లో కైరా నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం విదితమే. ఇక తెలుగులో ఎంట్రీ ఇస్తూ మహేష్బాబు సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించడం విశేషం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.