Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగచైతన్య, అను ఇమ్మాన్యుయెల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, 'ఓ మంచి చిత్రాన్ని నాగచైతన్య, మారుతి కాంబినేషన్లో నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇందులోని కథ, కథనం, పాత్రల తీరు తెన్నులు చాలా ఫ్రెష్గా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి' అని చెప్పారు. రమ్యకృష్ణ, వెన్నెలకిషోర్, కళ్యాణి నటరాజన్, శరణ్య, పృథ్వీ, రఘుబాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : గోపీసుందర్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ, ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం :మారుతి.