Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మే నుంచి ప్రారంభం కానుంది. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న టాలెంటెడ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓ కొత్త జోనర్లో ఈ సినిమా ఉంటుంది. ఇది వరకూ సాయిధరమ్ తేజ్ చేయని కాన్సెప్ట్తో రూపొందిస్తున్నాం. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ప్రస్తుతం మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని చెప్పారు.