Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య భరత్ చంద్ర, శ్రావ్యారావు జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో
శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై జై వర్ధన్ బోయెనేపల్లి నిర్మిస్తున్న చిత్రం 'సంత'. 'మట్టి మనుషుల ప్రేమ కథ' అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రం గురించి నిర్మాత
జై వర్ధన్ మాట్లాడుతూ,'గ్రామీణ నేపథ్యంలో ఓ సంత ప్రధానంగా సాగే ప్రేమ కథ ఇది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. వరంగల్లోని చిలుపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇటీవలే ప్రారంభమైన ఈచిత్రం తాజాగా
తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తెలంగాణలోని అందమైన లొకేషన్లలో
చిత్రీకరణ జరుపుతున్నాం. త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అలాగే ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని అన్నారు. కిన్నెర, మధుమణి, తాగుబోతు రమేష్, రఘు కారుమంచి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి.