Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'సాక్ష్యం' చిత్రంలో నటిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చారు. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని(నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ, 'ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో మా బ్యానర్ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'దృశ్యం', 'గోపాల గోపాల', 'డిక్టేటర్' చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు.
ఈ చిత్రానికి కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు థమన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వంటి సీనియర్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను వెల్లడిస్తాం. ఈ నెల 22న హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో
సినిమాను ప్రారంభించనున్నాం' అని చెప్పారు.