Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జై గంగాజల్' చిత్రం తర్వాత ప్రియాంక చోప్రా బాలీవుడ్లో ఏ ఒక్క సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుత హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు గ్రీన్సిగల్ ఇచ్చినట్టు సమాచారం. 2004లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయం సాధించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 'ఐత్రాజ్' సీక్వెల్లో నటించనుందట. అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో అక్షరు కుమార్, కరీనా కపూర్ జోడీగా నటించగా, ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్ చేసి మెప్పించింది. తాజాగా దర్శకుడు సుభాష్ ఘారు
ఆ చిత్రానికి సీక్వెల్ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్న ఈచిత్రకథను ప్రియాంక విని సుముఖత వ్యక్తం చేయడంతోపాటు పలు సలహాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ 'క్వాంటికో' తాజా సీజన్ను పూర్తి చేసుకున్నాక ఈ బాలీవుడ్ చిత్ర షూటింగ్లో ప్రియాంక పాల్గొననుందట. ప్రస్తుతం హాలీవుడ్లో 'ఏ కిడ్ లైక్ జేక్', 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్?' చిత్రాల్లో ప్రియాంక నటిస్తూ బిజీగా ఉంది.