Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏక్ దో తీన్..' పాటలో మాధురీ దీక్షిత్ నర్తించినట్టుగా మరెవ్వరూ చేయలేరు. ఆమెకు ఆమే సాటి' అని అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. 1988లో విడుదలైన 'తేజాబ్' చిత్రంలోని మాధురీ నటించిన 'ఏక్ దో తీన్' సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో కుర్రకారును ఓ ఊపుఊపిన ఈ పాటను తాజాగా 'బాఘి 2' చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు.
ఈ పాటలో జాక్వెలిన్ నటించింది. ఈ సందర్భంగా ఈ పాట గురించి జాక్వెలిన్ మాట్లాడుతూ, 'ఈ పాటలో మాధురీ మేడమ్లా మరెవ్వరూ చేయలేరు. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు. అంతేకాదు ఆమెతో నాకు పోటీ లేదు. కానీ నా వంతుగా ది బెస్ట్ చేశాను. మాధురీ మేడమ్ మీద ప్రేమతో ఈ పాటను ఆమెకే అంకితమిస్తున్నా. ఈ పాటను ఆమె ఎప్పుడెప్పుడు వీక్షిస్తారనే ఆతృతతో ఎదురు చూస్తున్నా' అని తెలిపింది. తాజాగా ఈ చిత్రంలోని 'ఏక్ దో తీన్' పాట కోసం మల్టీకలర్ కాస్ట్యూమ్ ధరించి అచ్చు మాధురీ దీక్షిత్ను తలపించే ఫొజ్ ఇచ్చిన జాక్వెలిన్ ఫొటోను మాధురీ దీక్షిత్ శుక్రవారం రిలీజ్ చేశారు. 2016లో వచ్చిన 'బాఘి' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న 'బాఘి 2' చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ షరాఫ్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయనున్నారు. జాక్వెలిన్ ప్రస్తుతం 'డ్రైవ్', 'రేస్ 3' చిత్రాల్లో నటిస్తోంది.