Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిర్చి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న కమర్షియల్ చిత్రం 'సాహో'. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్కు, దర్శకుడు సుజిత్కు మధ్య విబేధాలు తలెత్తాయని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సుజిత్ను ఓ అభిమాని ట్విట్టర్లో ప్రశ్నించగా అందుకు సుజిత్ స్పందించారు. 'మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. చాలా ఉత్సాహంగా చిత్ర షూటింగ్ జరుగుతోంది. మధ్యలో వచ్చే ఇలాంటి వార్తలు మాకు వినోదాన్ని కలిగిస్తాయి' అని చెప్పారు. ప్రభాస్ ఆరోగ్యంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 'ప్రభాస్ ఫిట్గా, సంతోషంగా ఉన్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. వదంతులను నమ్మొద్దు' అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు తెలుగు, తమిళం, హిందీలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఓ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.