Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాకు సెట్ అయ్యే కథ దొరికే వరకు ఖాళీగా ఇంట్లోనైనా కూర్చుంటాను తప్ప ఏది పడితే అది చేయను' అని అంటోంది సోనమ్ కపూర్. విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ ప్రస్తుతం మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు ప్రయారిటీ ఇస్తోందట. ఆ విశేషాలను మీడియాతో పంచుకుంటూ, 'ప్రస్తుతం నటిస్తున్న 'ఏక్ లడఖీకో దేఖా తో హైసా లగా', 'ది జోయా ఫ్యాక్టర్' చిత్రాల్లో నటించే ఛాన్స్లు రావడం ఈజీ. ఎందుకంటే గతంలో ఇలాంటి పాత్రలు చేశా. వీటికంటే మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్రలు వస్తే బాగుంటుంది. రచయితలు కూడా అలాంటి డెప్త్ ఉన్న పాత్రలు రాయాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది. సోనమ్ ప్రస్తుతం
'సంజు', 'వీర్ ది వెడ్డింగ్' చిత్రాల్లోనూ నటిస్తోంది.