Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఛలో' వంటి విజయవంతమైన సినిమా తర్వాత నాగశౌర్య హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'నర్తనశాల'. శ్రీనివాస చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. నాగశౌర్యపై వంశీపైడిపల్లి క్లాప్నిచ్చారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ, 'కృష్ణవంశీ దగ్గర పనిచేసిన శ్రీనివాస చక్రవర్తిని మా సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నా నిర్ణయాన్ని నమ్మిన అమ్మ(ఉషా ముల్పూరి)కి థ్యాంక్స్. ఇది పాత 'నర్తనశాల'కు రీమేక్ అని, డాన్స్ ప్రధాన చిత్రమని అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తి వినోదాత్మక చిత్రం. ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. 'ఛలో'కు 'చూసి చూడంగానే..' వంటి సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. ఎడిటర్ చంటిగారు మా సంస్థలో భాగమయ్యారు. కెమెరామెన్ విజరుతో చాలాసార్లు పనిచేయాలనుకున్నాను. ఈ చిత్రంతో కుదిరినందుకు హ్యాపీగా ఉంది. మా బ్యానర్లో నిర్మించే రెండో సినిమాలో కూడా నన్నే హీరోగా పెట్టుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్' అని అన్నారు. 'తల్లిదండ్రులు, దేవుడు తర్వాత ఈ చిత్ర నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ తరహా కథను నమ్మి సినిమా చేస్తున్నందుకు, పెద్ద టెక్నీషియన్లను ఇచ్చినందుకు. ఈ బ్యానర్లో వచ్చిన 'ఛలో' కంటే పెద్ద హిట్ సినిమా చేస్తానని మాటిస్తున్నాను. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. పాత 'నర్తనశాల'కు సంబంధించిన కొన్ని ఛాయలు నేటి కనుగుణంగా ఉంటాయి. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం' అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నరేష్, జయప్రకాష్రెడ్డి, అజరు, పోసాని, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.