Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'భరత్ అనే నేను'.
కైరా అద్వాని కథానాయికగా డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచెకట్టుతో సరికొత్తగా ఉన్న మహేష్ లుక్ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ, 'మన తెలుగు సంవత్సరాది పండుగ కళ ఉట్టిపడే పంచె కట్టుతో ఉన్న మహేష్ పోస్టర్ను విడుదల చేశాం. మహేష్ పంచెకట్టులో కనిపించడం మొదటిసారి. ప్రేక్షకులకు, అభిమానులకు మహేష్ కొత్త లుక్ కనువిందు చేస్తోంది. ఈ లుక్కి అత్యద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి
ఓ పాట చిత్రీకరణ రాజు సుందరం నేతృత్వంలో జరుగుతోంది. భారీ టెంపుల్ సెట్లో 100 డాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్గా ఈ సాంగ్ను షూట్ చేస్తున్నాం. ఈనెల 25 నుంచి స్పెయిన్ ఓ షెడ్యూల్ ఉంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని చెప్పారు.