Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ ఇటీవల సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. గతేడాది రెండు సినిమాలు 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్'తో ఆకట్టుకున్న ఆయన ఈ ఏడాది 'జై సింహా'తో మెప్పించారు. ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్లో నటించ బోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 'ఎన్టీఆర్' సినిమా తర్వాత రీమేక్ చిత్రంలో నటించేందుకు బాలకృష్ణ ఆసక్తిగా ఉన్నారట. కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన విజయవంతమైన సినిమా 'మఫ్టీ'. ఇటీవలే సినిమాను చూసి ఇంప్రెస్ అయిన బాలకృష్ణ తన నెక్ట్స్ చిత్రంగా ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తు న్నారట. శివరాజ్ కుమార్, శ్రీ మురళీ, శాన్వీలు ప్రధాన పాత్రధారులుగా యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'మఫ్టీ' చిత్రం కన్నడలో పెద్ద హిట్ అయ్యింది. బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించిన విషయం విదితమే. ఆ పరిచయంతోనే ఇటీవల ఆ సినిమాను బాలకృష్ణ తిలకించినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి రీమేక్కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది మున్ముందు తెలియనుంది. బాలకృష్ణ ప్రస్తుతం నటించబోయే 'ఎన్టీఆర్' చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.