Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''లక్ష్మీ కళ్యాణం' చేసేటప్పుడు ఈ ఒక్క సినిమా చేసి ఇండిస్టీని వదిలేసి ఎంబీఏ చేయాలనుకున్నా. కానీ 'మగధీర' తర్వాత ఇదే నా జీవితమనే నిర్ణయానికి వచ్చేశాను' అని అంటోంది కాజల్. 'లక్ష్మీ కళ్యాణం'తో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమై 12ఏండ్ల కెరీర్లో 50కిపైగా చిత్రాల్లో నటించిన కాజల్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్కి జోడీగా 'ఎంఎల్ఏ' చిత్రంలో నటించింది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్ గురువారంతో మీడియాతో ముచ్చటించింది.
'కళ్యాణ్ రామ్తో పదేండ్ల క్రితం నటించా. ఇన్నేండ్ల తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అప్పటికీ, ఇప్పటికీ మాలో చాలా మార్పు వచ్చింది. నటులుగా పరిణతి సాధించాం. ఇండిస్టీలో మాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాం.
కళ్యాణ్ రామ్ హార్డ్ వర్కర్, ఫోకస్డ్, డెడికేషన్తో వర్క్ చేస్తారు. ఈ సినిమాలో నేను ఎన్ఆర్ఐగా కనిపించే కార్పొరేట్ ఉద్యోగిని. అంతేకాదు నా పాత్రలో మరో షేడ్ ఉంటుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో చదువు ప్రాధాన్యతను తెలిపే ఒక సందేశం ఉంటుంది. హార్డ్గా, మొట్టికాయ వేసినట్టుగా కాకుండా వినోదాత్మకంగా ఆ సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. సినిమాలో మల్టీజోనర్స్ కనిపిస్తాయి. ఉపేంద్ర చాలా బాగా తెరకెక్కించారు. కచ్చితంగా ఎంటర్టైన్ చేసే చిత్రమిది. నా కెరీర్ విషయంలో, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల విషయంలో హ్యాపీగా ఉన్నా. నా హార్డ్వర్క్, నిజాయితీ, దర్శక, నిర్మాతలు నమ్మకం, తెలుగు ప్రేక్షకుల ఆదరణ, సక్సెస్ ఇలా అనేక అంశాల సమాహారమే నేను ఇన్నేండ్లు విజయవంతంగా కొనసాగడానికి కారణం. ఇటీవల చాలా సెలక్టీవ్గా చేస్తున్నా. స్ట్రాంగ్ రోల్స్కే ప్రాధాన్యతనిస్తున్నా. అందులో ఒకటి 'అ'. ప్రయోగాత్మక చిత్రమిది. దక్షిణాదిలో అమేజింగ్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. కాబట్టి బాలీవుడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 'క్వీన్' తమిళ రీమేక్లో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంలో నటిస్తున్నా. డేట్స్ లేకపోవడం వల్ల రవితేజ-శ్రీనువైట్ల చిత్రంలో చేయడం లేదు. కొత్తదనంతో కూడిన విభిన్న పాత్రలకే ప్రయారిటీ ఇస్తున్నా' అని కాజల్ తెలిపింది.