Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్య', 'ఆర్య 2' చిత్రాలతో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్కు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం మరోసారి కలిసి పని చేయబోతోందని సమాచారం. సుకుమార్ ప్రస్తుతం 'రంగస్థలం' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం ఈ నెల 30న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ 'నాపేరు సూర్య -నా ఇల్లు ఇండియా'లో నటిస్తున్నారు. ఇది మే 4న రిలీజ్ కానుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.