Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నీది నాది ఒకే కథ' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్
శ్రీవిష్ణు, సాట్నా టైటస్ జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో అరాన్ మీడియా వర్క్స్, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజరు, అట్లూరి నారాయణరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నీది నాది ఒకే కథ'. నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ,'శ్రీవిష్ణు ఈ కథ చెప్పినప్పుడు నా స్నేహితుడు గుర్తొచ్చాడు. తను నేషనల్ లెవల్లో బాస్కెట్ బాల్కి సెలక్ట్ అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అలాంటి వాళ్ళ జీవితాలను తెలిపే చిత్రమిది. అందరికీ కనెక్ట్ అవుతుంది' అని అన్నారు. 'ట్రైలర్ చూసి శ్రీవిష్ణుకి పెద్ద ఫ్యాన్ అయిపోయా. నా కథలాగా అనిపించింది. మార్నింగ్షోనే సినిమా చూడాలనే క్యూరియాసిటీతో ఉన్నాను. సినిమాను కొనాలనుకున్నప్పుడు అప్పటికే బిజినెస్ క్లోజ్ అయ్యిందని తెలిసి, మంచి చిత్రాన్ని మిస్ చేసుకున్నాననిపించింది. గత ఏడాది నుంచి కొత్త దర్శకులు ఇలాంటి మంచి కథలతో సినిమాలు చేస్తున్నారు. నారా రోహిత్ ఓ మంచి ఫ్రెండ్లా శ్రీవిష్ణుకి వెనకాల ఉంది సపోర్ట్ చేస్తున్నారు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని శర్వానంద్ తెలిపారు.
శ్రీవిష్ణు చెబుతూ, 'దర్శకుడు వేణు ఈ కథ చెప్పినప్పుడు నా కథలాగే అనిపించింది. మా పక్కింట్లోనో లేక ఎదురింట్లోనో ఉండి ఈ కథ రాసుకున్నాడా అనిపించింది. నా కోసమైనా సినిమా చేయాలనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా నా జీవితాన్ని సినిమాగా చూసుకోవాలనిపిస్తే ఈ చిత్రాన్ని చూడొచ్చు. చూసిన వారంతా సినిమా భలేగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని చేసినందుకు చాలా గర్వంగా ఉంది. చాలా మంది సొసైటీ కోసం చదువుతారు. మనకు నచ్చిన పని చేయడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించాలి. ఒక అమ్మాయి వెనుకపడి ప్రేమ కోసమే ఒప్పించినప్పుడు జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా. తల్లితండ్రులు పిల్లల్ని నమ్మాలి. వాళ్ళు నమ్మకపోతే రేపు ప్రపంచం ఏం నమ్ముతుంది?, కాబట్టి చదువుని చదువులానే ఉంచుదాం' అని చెప్పారు.
'ఈ మధ్య కొత్త దర్శకులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. అదే కోవలోకి వేణు ఊడుగుల కూడా రాబోతున్నాడని కచ్చితంగా చెప్పగలను' అని రాజ్ కందుకూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.నాగేశ్వర్రెడ్డి, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.