Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి' తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాల విషయంలో జోరు పెంచారు. ఇప్పటికే 'సాహో' చిత్రంలో నటిస్తున్న ఆయన తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అలాగే బాలీవుడ్లోనూ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీ అవ్వబోతున్నారు. ప్రస్తుతం 'సాహో' చిత్ర షూటింగ్ దుబారులో నెల రోజులపాటు జరుగనుంది.
ఇదిలా ఉంటే జూన్ నుంచి రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే ప్రభాస్ నెక్ట్స్ సినిమా ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు నిర్మించే ఈ చిత్రాన్ని జూన్లో యూరప్లో చిత్రీకరణ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. తెలుగు, తమిళంలో రూపొందే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. జూన్ షూటింగ్లో పూజా పాల్గొననుందని, జులై ప్రభాస్ జాయిన్ అవుతారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం వచ్చే నెలలో ముంబయిలో వర్క్ షాప్ నిర్వహిస్తారట. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.