Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 9వ రోజు కూడా అత్యంత సందడిగా సాగింది. ఇటీవల ఆకస్మికంగా మరణించిన అతిలోక సుందరి శ్రీదేవికి కేన్స్ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమెకు టైటాన్ రెజినాల్డ్ ఎఫ్ లెవిస్ అవార్డును ప్రకటించి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీంతోపాటు మాలిని రూపొందించిన శ్రీదేవి లైవ్స్ ఫరెవర్ అనే మ్యూజికల్ డాక్యుమెంటరీని ఇందులో ప్రదర్శించి నివాళ్లర్పించారు. అంతేకాకుండా ఈ ఆల్బమ్ను శ్రీదేవికి అంకితమిచ్చారు.
ఈ డాక్యుమెంటరీలో ఆమె ఫొటోలు, సినిమాలు, పలు సందర్భాల్లో మాట్లాడిన స్పీచ్లు ఉన్నాయి. ఇక బుధవారం 'బర్నింగ్' చిత్ర ప్రీమియర్లో భాగంగా బర్బారా పాల్విన్, అడ్రియానా లిమా, మిల్లా జోవోవిచ్, మ్యాగీ, లా టోయా జక్సన్, ఇసబెల్ గౌలార్ట్, సిండీ బ్రునా, ఐమినైల్ వాల్డేడ్, టోని గార్న్ వంటి తదితరులు రెడ్ కార్పెట్పై సందడి చేశారు. అలాగే చిత్ర బృందం జియోన్ జోంగ్ సేయో, యు ఆV్ా ఇన్, లీ చాంగ్ ఎర్రతివాచీపై ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక 'ఎట్ వార్' ఫొటోకాల్లో నటుడు విన్సెంట్ లిండన్, ఫ్రెంచ్ డైరెక్టర్ స్టీఫెన్ బ్రైజ్ తదితరులు, 'లాండ్ డేస్ జర్నీ ఇన్టూ నైట్' చిత్ర ఫొటోకాల్లో చిత్ర బృందం పాల్గొని హల్చల్ చేశారు. 'బర్నింగ్' చిత్ర ప్రీమియర్లో 62ఏండ్ల నటి లా టోయా జాక్సన్ ట్రెండీ, యూత్ఫుల్గా ఉండే బ్లాక్ లెదర్ గౌన్ ధరించి కేన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమె పాప్ సూపర్స్టార్ మైఖేల్ జాక్సన్ సోదరి అనే విషయం విదితమే. ఇందులో టోనీ గార్న్, ఐమినైల్ వాల్డేడ్, కిండీ బ్రునా ధరించిన డ్రెస్సులు చర్చనీయాంశంగా మారాయి. పలు ఫ్యాషన్ వీక్స్లో మోడల్స్ ధరించిన డ్రెస్లను పోలిన దుస్తుల్లా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మోడల్స్తో పోల్చుతూ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో బాలీవుడ్ చిత్రం 'లిహాఫ్' ఫస్ట్లుక్ను విడుదల చేశారు. రెహట్ కాజ్మీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఉర్దు రచయిత్రి ఇస్మాత్ చుగ్తారు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇస్మాత్ ఎంత గొప్ప రచయితో, అంతే వివాదాస్పద వ్యక్తిగానూ పేరు తెచ్చుకున్నారు.
ఆమె రాసిన షార్ట్ స్టోరీ లిహాఫ్ అశ్లీలాన్ని, స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఇదిలా ఉంటే, సోనమ్ కపూర్ ఏడు, ఎనిమిది రోజుల్లో కేన్స్లో సందడి చేసింది. తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి కేన్స్లో హొయలు పోయింది. పెళ్ళి తర్వాత సినిమాల్లో నటించడం, పేరు మార్చుకోవడంపై మీడియా ప్రశ్నించగా, ఆమె స్పందిస్తూ, 'కాజోల్, డింపుల్ కపాడియా, నర్గీస్, వాహిదా రెహ్మాన్, మాధురీ దీక్షిత్ వంటి కథానాయికలు పెళ్ళి తర్వాత కూడా తమ కెరీర్ను కొనసాగించారు. అలాంటప్పుడు నేను కొనసాగించడంలో తప్పులేదు. మహిళలు అన్ని విషయాల్లో ముందుకు రావాలి. ఇంకా శక్తివంతంగా తయారు కావాలి. పెళ్లి అయిన వెంటనే నేను కేన్స్లో పాల్గొనడమే నాకు మా ఫ్యామిలీ అందిస్తున్న ప్రోత్సాహానికి, సహకారానికి నిదర్శనం. ఇక నా పేరును సోనమ్ ఆహుజాగా మార్చుకోవడం నా ఇష్టపూర్వకంగానే జరిగింది.
నా జీవితానికి సంబంధించి నేనే నిర్ణయం తీసుకుంటాను.
నన్నెవరు గన్ను పెట్టి బలవంతంగా చేయించరు' అని తెలిపింది. ఇటీవల బాలీవుడ్ నటి నందితా దాస్ రూపొందించిన 'మంటో' చిత్రం కేన్స్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనిపై నందితా దాస్ స్పందిస్తూ, 'ప్రీమియర్ జరుగుతున్న టైమ్లో ఉత్సాహంగా, ఆందోళన కరంగా అనిపించింది. మొత్తంగా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఈ సినిమాను తీయడం ఓ అద్భుతమైతే, దాన్ని కేన్స్లో ప్రదర్శించడం మరో అద్భుతం. ఈ చిత్రం నాలోని స్పిరిట్ను మరింత పెంచింది. విమర్శకుల నుంచి అరుదైన ప్రశంసలందుకుంది' అని తెలిపింది.
ఉర్దు రచయిత సాదత్ హాసన్ మంటో జీవితం ఆధారంగా నందితా దాస్ ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఓషో జీవితం ఆధారంగా మలయాళంలో మోహన్లాల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. తాజాగా బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘారు ఓషో జీవితం ఆధారంగా అంతర్జాతీయ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన కేన్స్ వేడుకలో ప్రకటించారు. 'ఓషో: ది అదర్ సైడ్ ఆఫ్ ది ఓసియన్' పేరుతో ఈ సినిమాను తీయనున్నట్టు తెలిపారు. ఇటాలియన్ ప్రొడక్షన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా పలు రకాల ఆసక్తికర అంశాలతో తొమ్మిదవ రోజు కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకలు వీక్షకుల్ని ఆద్యంతం అలరించాయి.