Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిశా పటానీ. వరుణ్ తేజ్కి జోడీగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం రాబట్టలేకపోవడంతో దిశాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో 'ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ', 'కుంగ్ ఫూ యోగా', 'బాఘి 2' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన నటించే అరుదైన లక్కీ ఛాన్స్ను దక్కించుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ 'భారత్' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ప్రియాంక చోప్రా ఈ చిత్రంతో బాలీవుడ్కి రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో మరో కథానాయికగా దిశాని ఎంపిక చేశారట. తొలుత ఈ పాత్ర కోసం శ్రద్ధా కపూర్ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల దిశాను ఫైనల్ చేసినట్టు సమాచారం.'ఓడే టు మై ఫాదర్' అనే సౌత్ కొరియన్ సినిమా ఆధారంగా 'భారత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో రూపొందబోతున్న 'సంఘమిత్ర' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.