Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహానటి'లో సావిత్రి పాత్రకు జీవం పోసి అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకుంది కీర్తిసురేష్.
దీంతో ఇప్పుడు దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలు సైతం ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపటం విశేషం. అందులో భాగంగానే తెలుగులో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్లో కీర్తిని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా, రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ను రూపొందించబోతున్నారు.
డి.వి.వి. దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే సెట్స్పైకి వెళ్ళనుంది. 'మహానటి'లో కీర్తి నటన చూసి ఫిదా అయిన రాజమౌళి తన చిత్రంలో ఓ కథానాయికగా ఆమెను ఎంపిక చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే, తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్లో కథానాయికగా కీర్తిసురేష్ను తీసుకునే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందులో కీర్తి నటిస్తుందా లేదా అనేది సస్పెన్స్. కీర్తి ప్రస్తుతం తమిళంలో 'సామి 2', 'సందకోజి 2'తోపాటు విజరు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.