Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షకలక శంకర్ కథానాయకుడిగా రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'డ్రైవర్ రాముడు'. మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగుళ్ళ, ఎమ్.ఎల్.రాజు, ఆర్.ఎస్.కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను
హీరో సుధీర్బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'హాస్యనటుల్లో నాకు నచ్చిన నటుడు షకలక శంకర్. అతనొక సినిమాలో ఉన్నాడంటే ఆ సినిమాలోని కామెడీ కచ్చితంగా చాలా బాగుంటుంది. తాను హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కామెడీ అత్యద్భుతంగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఆద్యంతం వైవిధ్యభరితంగా ఉన్న ఈ చిత్ర టీజర్ను నేను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. షకలక శంకర్కి ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందించాలి. దర్శకుడితోపాటు చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. 'ఇప్పటివరకు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన శంకర్లో మరో కొత్త కోణాన్ని ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంకర్ మార్క్ కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో ఈచిత్ర కథనం ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అవుట్ఫుట్ చాలా బాగా వచ్చింది. మా సినిమా టీజర్ను రిలీజ్ చేసిన సక్సెస్ఫుల్ కథానాయకుడు సుధీర్బాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని దర్శకుడు రాజ్ సత్య చెప్పారు. 'టీజర్ చూసి ఎంతో బాగుందని సుధీర్బాబు ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది.
త్వరలోనే ఆయనకు ప్రత్యేకంగా షో వేయబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. ఇటీవల మూడో షెడ్యూల్ పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని నిర్మాతలు తెలిపారు. ఆంచల్ సింగ్, ప్రదీప్రావత్, నాజర్, తాగుబోతు రమేష్, ధన్రాజ్, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, ఆర్ట్ : రఘు కులకర్ణి, కెమెరా : అమర్నాథ్.