Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు రెహ్మాన్ ప్రధాన పాత్రలో సెంథిల్ నాథన్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ పతాకంపై 'డా||సత్యమూర్తి' పేరుతో నిర్మాత డి.వెంకటేష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. రిలీజ్కు రెడీగా ఉన్న ఈ చిత్ర ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. సినీ పాత్రికేయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్ను, పాటల బిగ్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా పసుపులేటి రామారావు మాట్లాడుతూ, 'రెహ్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించాలి' అని అన్నారు. 'టైటిల్ ఆసక్తికరంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్నిస్తుంది' అని సంగీత దర్శకుడు కనిష్క్ తెలిపారు. నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ, 'సోషల్ మీడియా, ఫేస్బుక్లో తమ ఎకౌంట్స్కి వేరే వాళ్ళ ఫొటోలు పెట్టి మోసం చేస్తుంటారు. అలానే బయటికి ఒకలా, లోపల మరోలా ప్రవర్తించే డాక్టర్ కథ ఇది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుంది. అది ఆకట్టుకుంటుంది. జూన్ 1న విడుదల చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి. కచ్చితంగా తెలుగు ఆడియెన్స్ను అలరిస్తుంది' అని నటుడు విక్రమ్ శేఖర్ తెలిపారు. 'సోషల్ మీడియా వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారు చాలా మందే ఉన్నారు. యువత ఎక్కువగా దీనికి బానిస అవుతుంది' అని విజరు కిరణ్ చెప్పారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని సినీ పాత్రికేయులంతా ఆకాంక్షించారు.