Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరోలు నిర్మాతలుగా మారడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల జరుగుతున్నదే. పవన్కళ్యాణ్, మహేష్, కళ్యాణ్రామ్, నాని ఇలా చాలా మంది సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు సుధీర్బాబు కూడా నిర్మాతల జాబితాలో చేరిపోయారు. సుధీర్బాబు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ను ప్రారంభించ బోతున్నారు. ఈ నెల 26న పలువురు సినీ ప్రముఖల సమక్షంలో ఈ బ్యానర్ లోగోను ఆవిష్కరించనున్నారు. ఈ విశేషాలను సుధీర్బాబు ప్రొడక్షన్స్కి చెందిన ప్రతినిధులు తెలియజేస్తూ, ''ప్రేమ కథా చిత్రం', 'భలే మంచి రోజు', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' వంటి విభిన్న కథా చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి హీరోగా సుధీర్బాబు ఆకట్టుకున్నారు. బాలీవుడ్లో 'బాఘి' చిత్రంలో విలన్ పాత్ర పోషించి మెప్పించారు. ఆయన నిర్మాతగా ఇప్పటికే ఓ సినిమాను ప్రారంభించారు. ఇది దాదాపు 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతోపాటు వరుసగా పలు వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు నటుడిగానూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రొమాంటిక్ కామెడీ 'సమ్మోహనం'లో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే మరో విభిన్న కథా చిత్రం 'వీరభోగ వసంత రాయలు' చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఆగస్టులో పుల్లెల గోపీచంద్ బయోపిక్లో నటించబోతున్నారు. ఇలా హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ ప్రారంభించడం విశేషం' అని చెప్పారు.