Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విషయమే. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రధారిణిగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని, శ్రద్ధా నటించడం లేదని పలురకాల వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొన్ని రోజులు బాడ్మింటన్ను ప్రాక్టీస్ చేసి మధ్యలో ఆపేసిన శ్రద్ధా తాజాగా మళ్ళీ ట్రైనింగ్ను స్టార్ట్ చేశారట. ఆట ఆడే క్రమంలో సైనా నెహ్వాల్ పలికించే హావభావాలు, బాడీ లాంగ్వేజ్, రాకేట్ను ఉపయోగించే విధానం.. ఇలా అన్ని విషయాల్లో శ్రద్ధా శిక్షణ తీసుకుంటున్నారట. వర్క్షాప్లో భాగంగా శ్రద్ధా ఆటపై మంచి పట్టు సాధించిందని చిత్ర బృందం చెబుతోంది. దీంతోపాటు సైనా వాడే మాండలికంపై కూడా శ్రద్ధా దృష్టి పెట్టారని, దీని కోసమై హర్యానాకు వెళ్ళడానికి కూడా శ్రద్ధా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ సందర్భంగా దర్శకుడు అమోల్ గుప్తా చెబుతూ, 'శ్రద్ధా ట్రైనింగ్ చాలా ఫోకస్డ్గా సాగుతుంది.
ఆమె ఓ స్థాయికి చేరుకుంది. ఎలాంటి గాయల పాలవ్వకుండా జాగ్రత్తగా ఆటను డీల్ చేస్తున్నారు' అని తెలిపారు. శ్రద్ధా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. శ్రద్ధా దీంతోపాటు 'బట్టి గుల్ మీటర్ ఛాలు', 'స్ట్రీ' చిత్రాల్లో నటిస్తున్నారు.