Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దఢక్' చిత్రం అమ్మ (శ్రీదేవి) లేదన్న బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది. ఈ సినిమా చేయకపోయి ఉంటే నా పరిస్థితి ఆందోళనకరంగా ఉండేది' అని జాన్వీ కపూర్ అన్నారు. జాన్వీ కథానాయికగా తెరంగేట్రం చేస్తూ 'దఢక్' చిత్రంలో నటిస్తున్నారు. మరాఠిలో సంచలన విజయం సాధించిన 'సైరత్' చిత్రానికిది రీమేక్. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలై అందరి ప్రశంసలను సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే శ్రీదేవి హఠాన్మరణం చెందారు. ఆ బాధ నుంచి ఎలా తేరుకున్నారని జాన్వీని ఇటీవల మీడియా ప్రశ్నించగా, ఆమె స్పందిస్తూ,
'అమ్మ లేరన్న బాధ నుంచి తేరుకోవడం ఈజీ కాదు. నేను చేసే పని, నా కుటుంబం నాలో ధైర్యాన్ని నింపాయి. నేనీ సినిమాలో నటించలేకపోయినా, షూటింగ్లో పాల్గొన లేకపోయినా పరిస్థితి దారుణంగా ఉండేది. 'దఢక్'లో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం నన్ను ఎన్నో విధాలుగా కాపాడింది' అని భావోద్వేగంతో చెప్పారు. ఈ సందర్భంగా తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుని జాన్వీ కంటతడి పెట్టారు. ఇదిలా ఉంటే, 'ధడక్' చిత్రానికి సంబంధించి ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఇందులో జాన్వీ అచ్చు శ్రీదేవిలా మాయ చేసిందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కరణ్జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.