Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతోంది. చాలా సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. జులై 5న రాబోతున్న 'పంతం' కూడా పెద్ద హిట్ కావాలి' అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం 'పంతం'. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని 'రైట్ నౌ..' అంటూ సాగే రెండవ పాటను మంత్రి తలసాని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా ఈ సినిమాను రాధామోహన్ నిర్మించడం అభినందనీయం. గోపీచంద్ టాలెంటెడ్ హీరో. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. మంచి అనుభవం ఉన్న టీమ్ సినిమా కోసం పనిచేసింది. సినిమా విజయం సాధించి హీరో గోపీచంద్తోపాటు టీమ్ అందరికి మంచి పేరు తీసుకురావాలి. నిర్మాతకు డబ్బులు తీసుకురావాలి' అని అన్నారు. 'సినిమా రంగం చాలా గొప్పది. తలసాని సినిమాటోగ్రఫీగా ఉన్న ఈ రంగం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను' అని ప్రజా గాయకుడు గద్దర్ చెప్పారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ చెబుతూ, 'మా బ్యానర్లో గోపీచంద్తో కలిసి చేసిన తొలి చిత్రమిది. ఆయనకిది 25వ చిత్రం కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి జులై 5న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.