Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సమ్మోహనం'తో యువతనే కాదు, తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిన అదితిరావు హైదరీ తెలుగులో మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు. ఏకంగా మహేష్ సరసన నటించే లక్కీ ఛాన్స్ అదితి అందిపుచ్చుకుందని సమాచారం. మహేష్బాబు ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో మరో కథానాయికకి అవకాశముందట. ఆ పాత్రకు ఇటీవల 'సమ్మోహనం'తో అలరించిన అదితిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ ఛాన్స్ రావడంతో అదితి అమితానందంలో ఉన్నారట.
ఇటీవల డెహ్రాడూన్లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మహేష్ కాలేజ్కి వెళ్లే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఆయా సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చిరు గెడ్డంతో విద్యార్థి గెటప్లో మహేష్ ఆకట్టుకుంటున్నారు. అదితి ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ సరసన సైన్స్ ఫిక్షన్ చిత్రంలోను, మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' చిత్రంలోనూ నటిస్తున్నారు.