Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్ విజయ్, నిహారిక జంటగా ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో నిర్వాణ సినిమాస్ పతాకంపై సందీప్ యెర్రమ్రెడ్డి, సుజన్ యారబోలు, రామ్ నరేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు క్లాప్నివ్వగా, వరుణ్తేజ్ కెమెరా స్విచాన్ చేశారు. శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, 'గతంలో 'ముద్దపప్పు అవకారు', 'నాన్నకూచి' వెబ్ సిరీస్ రూపొందించాను. వాటికి మంచి ఆదరణ లభించింది. దర్శకుడిగా నాకిది తొలిచిత్రం. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాం. ప్రేమ కథ, పాత్రల తీరుతెన్నులు చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు చూడని ఓ కొత్త, డిఫరెంట్ స్క్రీన్ప్లేను చూస్తారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఆగస్టులో రెండో షెడ్యూల్ ఉంటుంది. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ప్రణీత్ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన రూపొందించిన 'నాన్నకూచి'లో నిహారికతో కలిసి నటించాం. అదే టీమ్తో సినిమా చేయడం ఆనందంగా ఉంది' అని శివాజీరాజా చెప్పారు. నిహారిక మాట్లాడుతూ, 'ప్రణీత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. కొత్తగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. నా పాత్ర కూడా సరికొత్తగా ఉంటుంది. మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న నిర్వాణ సినిమాస్ సంస్థకు అభినందనలు. ఈ సినిమాతో విజయం అందుకోవాలి' అని అన్నారు. 'నా మొదటి సినిమా 'ఈ మాయ పేరేమిటో' మా సొంత బ్యానర్లో చేశా. కథ నచ్చడంతో బయటి బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నాను. ప్రణీత్ చెప్పిన కథ బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల స్టయిల్లో సినిమా ఉంటుంది'
అని హీరో రాహుల్ విజరు చెప్పారు.