Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే నాలుగైదు మల్టీస్టారర్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. తాజాగా మరో మల్టీస్టారర్కు రంగం సిద్ధమైంది. 'సమ్మోహనం' వంటి క్లాసీ హిట్ను అందుకున్న ఇంద్రగంటిమోహనకృష్ణ ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న విషయం విదితమే. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో నాని, శర్వానంద్ హీరోలుగా నటించనున్నట్టు తెలుస్తుంది. థ్రిల్లర్ జోనర్లో సినిమా తెరకెక్కనుందని, అందులో నాని, శర్వానంద్ హీరోలుగా నటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో నాని హీరోగా 'అష్టా చెమ్మా', 'జెంటిల్మేన్' చిత్రాలను ఇంద్రగంటి తెరకెక్కించారు. మరోసారి తన మ్యాజిక్ను ఈ మల్టీస్టారర్తో రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్'లో నటిస్తున్నారు. దీంతోపాటు 'జెర్సీ'లోనూ హీరోగా నటిస్తున్నారు. శర్వానంద్ 'పడి పడి లేచే మనసు', సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే మల్టీస్టారర్ చిత్రంలో నితిన్తో కలిసి నటించనున్నారు.