Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షకలక శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'డ్రైవర్ రాముడు'. రాజ్సత్య దర్శకత్వంలో కె.వేణుగోపాల్, ఎం.ఎల్.రాజు, టీ.కీరత్ సంయుక్తంగా సినిమా పీపుల్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈచిత్ర షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం స్పెషల్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్సత్య మాట్లాడుతూ, 'ఏకధాటిగా జరిపిన షూటింగ్తో సినిమా దాదాపు పూర్తయ్యింది. శివశంకర్ మాస్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం భారీ సెట్లో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. సినిమా నిర్మాణంలో నిర్మాతలెక్కడా రాజీపడటం లేదు. చిత్ర అవుట్ఫుట్ చూసి షకలక శంకర్ చాలా సంతోషంగా ఫీలయ్యారు' అని చెప్పారు. 'మేం ఊహించిన దాని కంటే సినిమా అద్భుతంగా వస్తోంది. మా దర్శకుడు రాజ్ సత్య భారీ సినిమాలాగానే చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు సునీల్కశ్యప్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన హైలైట్ అవుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని నిర్మాతలు తెలిపారు.