Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన సాయేషా సైగల్కు ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్, కోలీవుడ్ల్లో మాత్రం మంచి మంచి ఆఫర్లు రావడం విశేషం. ఇటీవల 'చినబాబు' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయేషా తమిళనాట మరో బంపర్ ఆఫర్ అందుకుంది. అలనాటి నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న యానిమేషన్ చిత్రంలో సాయేషా ఎంజీఆర్ పాత్రకు జోడీగా నటించనుంది. మోషన్ క్యాప్చర్ యానిమేషన్ టెక్ సినిమాగా 'కిళక్కు ఆఫ్రికా విల్ రాజు'ని ఎంజీఆర్ స్నేహితుడి కుమారుడు ఇషారి వెలన్ నిర్మిస్తున్నారు.