Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో, హీరోయిన్లుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నీవెవరో'. కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ సహ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'మూడు నగరాలు, రెండు ప్రేమకథలు, ఒక్క సంఘటన, ఒకటే లక్ష్యం.. అంటూ ఆసక్తికరంగా సాగే ఈ చిత్ర టీజర్ చాలా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆది పినిశెట్టికి రెండు ప్రేమకథలు ఏంటి?, తను ఫేస్ చేసిన సంఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్, మోషన్పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్కు ట్రెమండస్ అప్లాజ్ వచ్చింది. దర్శకుడు హరినాథ్ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఆది పినిశెట్టికి మంచి బ్రేక్ ఇచ్చే చిత్రమిది. తాప్సీ, రితికా సింగ్ల పాత్రలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి' అని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రానికి కెమెరా : సాయిశ్రీరామ్, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్: ప్రవీణ్పూడి.