Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రిష చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఆడియెన్స్ను అలరించడానికి రాబోతున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో 'మోహిని' చిత్రంలో నటిస్తున్నారు. ఆర్.మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మి పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్, శ్రీనివాసరావు పల్లెల, కరణం మధులత సంయుక్తంగా తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. రిలీజ్కు రెడీ అవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'త్రిషకి తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్గా అటు గ్లామర్ పాత్రలతోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆమె నటించిన 'మోహిని' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. హర్రర్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కింది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ గ్రాండియర్గా హర్రర్ బ్యూటీతో అందర్ని అలరించేలా సినిమా ఉంటుంది. త్రిష నటన సినిమాకు మరో ఆకర్షణ. మోహిని రూపంలో త్రిష అందర్నీ భయపెట్టడం ఖాయం. ఆమెతోపాటు జాఖీ, యోగిబాబు, పూర్ణిమా భాఖ్యారాజ్ ముఖ్య పాత్రలో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం, ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. థింక్ మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేస్తున్నాం. ఈ నెల 19న పాటలను, 27న తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: దినేష్ పూనరాజ్.