Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మకు ప్రతిష్టాత్మక స్మితాపాటిల్ అవార్డు లభించింది. గురువారం ముంబయిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, పియూష్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె స్వీకరించారు. 2008లో 'రబ్ నే బనా ది జోడీ' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనుష్క శర్మ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 'బ్యాండ్ బాజా బారాత్', 'పాటియాలా హౌస్', 'జబ్ తక్ హై జాన్', 'పీకే', 'ఎన్హెచ్ 10', 'బాంబే వెల్వెట్', 'సుల్తాన్', 'ఏ దిల్ హై ముష్కిల్', 'పరి', 'సంజు'లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 'ప్రతిష్టాత్మక స్మితాపాటిల్ అవార్డు అందుకోవడం గౌరవంగా, గొప్ప ప్రశంసగా భావిస్తున్నా. నేను బాలీవుడ్లోకి అడుగుపెట్టి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డు రావడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా ఇండిస్టీకి వచ్చాను. డిఫరెంట్ కథా చిత్రాలు చేసుకుంటూ ఈ స్థాయికి రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్' అంటూ అనుష్క శర్మ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.