Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో హౌంబలే ఫిల్మ్స్ సంస్థ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'కె.జి.ఎఫ్' అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీ నిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. విజరు కిర గంధూర్ నిర్మాత.
తమన్నా ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. బుధవారం చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సహ నిర్మాత కైకాల రామారావు మాట్లాడుతూ, 'సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటోంది. విడుదలైన ఫస్ట్లుక్కి విశేష స్పందన లభిస్తుంది.
అక్టోబర్ 14న ట్రైలర్ను విడుదల చేసి, నవంబర్ 16న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం' అని అన్నారు. 'అమెరికా, రష్యాకు మధ్య జరిగిన యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడంతో మనుషుల్లో అత్యాశ పెరిగింది. అదే సమయంలో కె.జి.ఎఫ్(కోలార్ బంగారు గనులు) భారతదేశంలోనే అతిపెద్ద బంగారు గని. అది ఒక్క మనిషి చేతిలోకి వెళితే
ఏమవుతుందనే ఇతివృత్తంతో ఈ సినిమాను మొదటి భాగంగా తెరకెక్కిస్తున్నాం' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత విజరు కిర గంధూర్ చెబుతూ,
'కోలార్ బంగారు గనుల వద్ద భారీ సెట్స్ వేసి సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. 70వ దశాబ్దంలో జరిగిన అప్పటి మాఫియా నేపథ్యానికి చెందిన కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. సినిమాలో తమన్నా ప్రత్యేక గీతం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది' అని చెప్పారు. అనంత్ నాగ్,అచ్యుత్ రావు, అయ్యప్ప, పి.శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: శ్రీకాంత్, సంగీతం: రవి భసూర్.