Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ సీఏం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్గా బాలకృష్ణ నటిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఎన్టీఆర్, శ్రీదేవి జోడీకి మంచి క్రేజ్ ఉండేది. 'వేటగాడు..' సినిమాలో 'ఆకు చాటు పిందె తడిసె..' పాట మాస్ను ఉర్రూతలూగించింది. ఈ బయోపిక్లో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. తాజాగా బుధవారం రకుల్ పుట్టిన రోజును పురస్కరించుకని చిత్రంలోని ఆమె లుక్ను విడుదల చేశారు. తెల్లటి బొట్టు, పూల చీరలో అచ్ఛం శ్రీదేవిని మరపించేలా అందంగా కనిపిస్తోంది. దీంతోపాటు 'వేటగాడు' సినిమాలోని 'ఆకు చాటు పిందె తడిసె..' పాట షూటింగ్లోని ఓ లుక్ను విడుదల చేశారు. వర్షంలోని ఈ లుక్ సైతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్గా బాలకృష్ణ, శ్రీదేవిగా రకుల్ పాత్రల్లో ఒదిగిపోయారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన పాపులర్ పాటలను ఈ చిత్రంలో చూపిస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇందులో ఏఎన్నార్గా సుమంత్, చంద్రబాబు నాయుడిగా రానా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న 'ఎన్టీఆర్-కథానాయకుడు', గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24న 'ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. వారాహి చలన చిత్ర, విబ్రి మీడియాలతో కలిసి ఎన్బీకే ఫిల్మ్స్ ఎల్ఎల్పీ పతాకంపై బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.