Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అరవింద సమేత' చిత్ర సక్సెస్మీట్లో దర్శకుడు త్రివిక్రమ్
ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'అరవింద సమేత'. గురువారం విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, 'సినిమాలో అభిమానులు కోరుకునే పాటలు తగ్గుతున్నాయా?, వినోదం మిస్సవుతోందా? అనే ఆలోచనలేవి పెట్టుకోకుండా నేను అనుకున్న కథను అనుకున్నట్టు తీయమని ఎన్టీఆర్ ప్రోత్సహించారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జెన్యూన్గా కథ చెప్పాలకున్నా. సినిమాపై ఎంత హైప్ను తగ్గించాలనుకున్న కుదరలేదు. సినిమా చూసి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నాకు గౌరవం తెచ్చిన సినిమా ఇది. మా అందరి కంటే కథని బలంగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ విషయంలో రుణపడి ఉంటాం. 1950, 60లో కథా బలమున్న సినిమాల్నే ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించారు. మళ్లీ ఇప్పుడు మన తెలుగులో అలాంటి ట్రెండ్ మొదలైంది. ఆ ప్రభావం వల్లే గత ఏడాదిన్నరగా కథా బలమున్న చిత్రాలే విజయం సాధిస్తున్నాయి. జెన్యూన్ హిట్ అయితే సోషల్ మీడియా ప్రేక్షకులే ప్రచారం చేస్తున్నారు. మా సినిమాకు అలాంటి స్పందనే లభిస్తోంది' అని అన్నారు. 'నైజాంలో సినిమాను విడుదల చేశాం. 'జనతా గ్యారేజ్', 'జైలవకుశ' చిత్రాల తర్వాత మా సంస్థ ద్వారా విడుదల చేసిన హ్యాట్రిక్ చిత్రమిది. మార్నింగ్ షో ఫర్వాలేదనిపించినా, మధ్యాహ్నం యునానిమస్గా హిట్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలుస్తుంది. త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చూపించాడు' అని దిల్ రాజు చెప్పారు. సునీల్ చెబుతూ, 'ఇలాంటి పాత్రలో నటించి చాలా రోజులవుతుంది. ఫ్యాక్షన్ చిత్రాల్లో క్లాసిక్గా నిలిచే సినిమా ఇది' అని చెప్పారు. '2010లో దసరా సమయంలో 'బృందావనం' సినిమాతో హిట్టు కొట్టాం. మళ్ళీ అదే దసరాకు ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది' అని తమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ చంద్ర, శత్రు, నవీన్ నూలి పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.