Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో 'శ్రీ అనంత పద్మనాభస్వామి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పి.సి.ఎం.స్టూడియోస్, మైత్రీ అసోసియేషన్స్ పతాకాలపై సి.హెచ్.వి.ఎస్.ఎన్.బాబ్జి, ఇ.ధర్మప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పాటల రికార్డింగ్ శుక్రవారం హైదరాబాద్లోని ఆర్పీ పట్నాయక్ స్టూడియోలో ప్రారంభమైంది. వేదవ్యాస్ భట్టాచార్య రాసిన శ్లోకాన్ని జీబు సంగీత దర్శకత్వంలో రికార్డ్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, 'ఈ కథ విన్నా. నిర్మాతలు మంచి ప్రాజెక్ట్ను ఎంచుకున్నారు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'థ్రిల్లర్ కథాంశంతో సినిమా సాగుతుంది. నవంబర్ రెండో వారంలో షూటింగ్ను ప్రారంభిస్తాం. తిరుపతి, రావులపాలెం, అంతర్వేదిల తోపాటు కేరళలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. గ్రాఫిక్స్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డి.సూర్యప్రకాష్, సంగీతం: జీబు.