Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ సినిమా బాగా ఆడుతుందో, ఏది పరాజయం చెందుతుందో మనం ఊహించలేం' అని అంటోంది అనుష్క శర్మ. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. అందులో తను నిర్మించిన 'పరి' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 'సంజు' చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన 'సూయి దాగా' మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా అనుష్క శర్మ చెబుతూ, 'సినిమాలను అంచనా వేయడం, ముందే ఊహించడమనేది గమ్మత్తైనా, వికారమైన అంశం. చాలా డిఫికల్ట్ కూడా. సినిమా విషయంలో ముందు మనం బాగానే అనుకుంటున్నాం. చివరి నిమిషంలో ఫలితాలు మారిపోతుంటాయి. 'సూయి దాగా' మంచి సినిమా అవుతుందనుకున్నాం. కానీ దర్శకుడు, హీరో అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. దీంతో విపత్కరంగా అనిపించింది. ఓ సినిమాకు నో చెప్పడం అంత ఈజీకాదు. అయితే సినిమా పోవడానికి నిజమైన కారణమేంటో చెప్పడానికి నేను వెనుకా డను' అని తెలిపింది.