Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ
'అదే నువ్వు అదే నేను' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్ కథానాయికగా, శశిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ పతాకాలపై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ దశమి పండుగ సందర్భంగా ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ క్లాప్ నిచ్చారు. దిల్రాజు, కె.రాఘేవంద్రరావు, గల్లా అరుణకుమారి సంయుక్తంగా స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, 'గల్లా అశోక్ను మా బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. 'అదే నువ్వు అదే నేను' టైటిల్తో అందరినీ ఆకట్టుకునే కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నాం. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలను అందించడంలో ముందున్న మా బ్యానర్ నుంచి వస్తున్న
మరో మంచి చిత్రమిది' అని చెప్పారు.