Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహ్మాన్ కలిసి పనిచేయబోతున్నారు.
హాకీ వరల్డ్ కప్ కోసం వీరిద్దరూ కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేయబోతున్నారు. 2018 మెన్స్ హాకీ వరల్డ్
కప్ ఈ సారి ఒడిసాలోని భువనేశ్వర్లో జరుగనుంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. దీని కోసం ఓ ప్రత్యేకమైన మ్యూజిక్ వీడియోను రూపొందించాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ మ్యూజిక్ వీడియోను షారూఖ్తో చేసేందుకు రెహ్మాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరులో ఈ పాటను విడుదల చేయనున్నారు. అలాగే నవంబర్ 27న రెహ్మాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే, రెహ్మాన్ను హీరోయిన్ శ్రుతి హాసన్ లాస్ ఏంజెల్స్లోని రెహ్మాన్ స్టూడియోలో కలిశారు. 'ఆస్కార్, గ్రామి అవార్డు విన్నర్, ఇండియన్ మ్యూజిషియన్ ఏ.ఆర్.రెహ్మాన్తో టైమ్ స్పెండ్ చేయడం నమ్మలేకపోతున్నా. నా జీవితం చుట్టూ ఇప్పుడు మ్యూజిక్ నిండిపోయింది' అంటూ రెహ్మాన్తో కలిసి దిగిన ఓ సెల్ఫీని శ్రుతి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.