Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో రొమాంటిక్ ఎంటర్టైనర్స్కి కేరాఫ్గా నిలిచిన ఇమ్రాన్ హష్మి కొంత గ్యాప్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అయితే ఈసారి తన పంథాకు భిన్నంగా ఓ కాన్టెంపరరీ సమస్య నేపథ్యంతో రాబోతున్నాడు. తనే సొంత ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా 'ఛీట్ ఇండియా' పేరుతో సినిమాని నిర్మించడం ఓ విశేషమైతే, ఇందులో లీడ్ రోల్ పోషించడం మరో విశేషం. మన దేశంలో జరుగుతున్న ఎడ్యూకేషన్ స్కామ్ నేపథ్యంలో సినిమా రూపొందుతున్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో రాకేష్ సింగ్ అనే పాత్రలో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఎడ్యూకేషన్కి సంబంధించిన డొనేషన్లు, రిజర్వేషన్లకు సంబంధించి రికమండేషన్లు, విద్యార్థుల వయసు వంటి వాటితోపాటు మొత్తంగా ఎడ్యూకేషన్ సిస్టమ్లోని లొసుగులను చర్చిస్తున్నారు. తాజా టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్, టీ సిరీస్తో కలిసి 'ఇమ్రాన్ హష్మి ఫిల్మ్స్' పతాకంపై ఇమ్రాన్ హష్మి నిర్మిస్తున్నారు. సౌమిక్ సేన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 25న సినిమా విడుదల కానుంది. గతేడాది 'బాద్షాహో' చిత్రంలో కీలక పాత్రలో మెప్పించిన ఇమ్రాన్ ఈ చిత్రంతోపాటు 'టైగర్స్' అనే మరో సినిమాలో నటించేందుకు గ్రీన్సిగల్ ఇచ్చారు.