Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో 'కవచం' చిత్రం రూపొందుతుంది. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని(నాని) నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్బంగా నిర్మాత నవీన్ శొంఠినేని (నాని) మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన టీజర్కి అద్భుతమైన స్పందన లభించింది. ఏకంగా 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టీజర్లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చెప్పే డైలాగ్లు ఆద్యంతం అలరిస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంది. టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 7న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే చిత్రమవుతుంది. తమన్ సంగీతం సినిమాకు పెద్ద అస్సెట్ అవుతుంది' అని అన్నారు. నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్థన్ రానే, పోసాని, సత్యంరాజేష్, అపూర్వ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా.