Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుంజరు, ఇర్రా మోర్ జంటగా సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భైరవగీత'. రామ్గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా,
భాస్కర్ రిషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం
'ఏ' సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'రాయలసీమ ఫ్యాక్షన్ లవ్ స్టోరీ నేపథ్యంలో యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. నూతన దర్శకుడు సిద్ధార్థ్ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన లభించడంతో సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. రవిశంకర్ సంగీతం చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. ధనుంజరు నటన ఆకట్టుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నాం' అని తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి.