Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి సినిమా ద్వారా సామాజిక సందేశం ఇవ్వడం సాధ్యం కాదు.
సందేశం ఇచ్చినంత మాత్రాన ఓ సినిమా సమాజ మార్పుకు కారణం కాలేదు'
అని అన్నారు ఇమ్రాన్ హష్మి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం
'ఛీట్ ఇండియా'. సౌమిక్ సేన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలోని విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రతిబింబిస్తుంది. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్లుక్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో లుక్ను విడుదల చేశారు. వెనకాల హిందూ దేవతల ఫొటోలు పెట్టుకుని, పక్కన సూట్కేసులో డబ్బుతో తన ఛాంబర్లో కుర్చుని నమస్కరిస్తున్న లెక్చరర్గా ఇమ్రాన్ హష్మి లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
విద్యా వ్యవస్థలోని అవినీతి అక్రమాలు, మాస్ కాపీయింగ్, రిజర్వేషన్లు వంటివి
ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. విద్యా ప్రమాణాలు దిగజారడానికి కారణం ఎవరన్న కథాంశంతో ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా
ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ, 'మన దేశం విద్యా వ్యవస్థ నిత్యం విరాజిల్లుతున్న మంచి వ్యాపారంగా మారింది. ఈ సినిమాకు తల్లిదండ్రులు, విద్యార్థులు బాగా రిలేట్ అవుతారు. కచ్చితంగా ఆకట్టుకుంటుంది' అని తెలిపారు. ఇమ్రాన్ హష్మి ప్రొడక్షన్స్, టీ సిరీస్లపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే
ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న విడుదల కానుంది.