Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి 'పడి పడి లేచే మనసు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. కోల్కతా నేపథ్యంలో హను రాఘవపూడి అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 17న శిల్పకళా వేదికలో జరగబోయే చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ అతిథిగా రానున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా సైతం ఆడియెన్స్ను మంత్రముగ్దుల్ని చేస్తుంది' అని తెలిపింది. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియా రామన్ ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.